చైనా సెల్ ఫోన్ కంపెనీ షావోమికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.ఆ సంస్థకు చెందిన రూ.5,551 కోట్ల నగదును సీజ్ చేశారు.ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈ నగదును ఈడీ సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
రాయల్టీ కింద ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బును షావోమి కంపెనీ ఎగవేసింది.ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు డబ్బు మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో కంపెనీకి చెందిన భారీ నగదును సీజ్ చేశారు.