దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.ఈ మేరకు నిందితులకు చెందిన రూ.76.54 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ముంబైలో విజయ్ నాయర్ కు చెందిన రూ.1.77 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.దినేశ్ అరోరాకు చెందిన రూ.3.18 కోట్ల విలువైన రెస్టారెంట్ ను జప్తు చేశారు.అదేవిధంగా హైదరాబాద్ లో పిళ్లైకి చెందిన రూ.2.25 కోట్ల ఆస్తులు , ఇండో స్పిరిట్ కంపెనీకి చెందిన 50 వాహనాలతో పాటు రూ.14.39 కోట్ల బ్యాంకు డిపాజిట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.మద్యం కుంభకోణంలో ఖజానాకు రూ.2,873 కోట్లు నష్టం వాటిల్లిందని ఈడీ తెలిపింది.