బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణంపై అనుమానాలు వ్యక్తం అయినా సంగతి తెలిసిందే.దీంతో సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు అయినా రియా చక్రవర్తిని అన్ని రకాలుగా విచారిస్తున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తి ఆదాయం, ఆర్ధిక లావాదేవీలు, పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.
అయితే ఈడీ అధికారులు ప్రశ్నించిన చాలా ప్రశ్నలకు ఆమె నుండి ఎటువంటి సమాధానం రాలేదు.ఆమె ఆదాయం ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది.2017-2018 సంవత్సరాలలో ఆమె ఆదాయం 18 లక్షలు ఉందని రియా తెలిపింది.అయితే 2018లో తొలుత ఆమె ఆస్తులు 96 వేలు ఫిక్స్ చెయ్యగా 2019లో పెరిగింది అని తెలిపారు.
అనంతరం ఆమె ఆస్తులు 27 లక్షలు అని తేలింది.
ఇంకా కొన్ని కంపెనీలలో ఆమె షేర్ హోల్డర్ గా పని చెయ్యగా అందులో 34 లక్షలు పెట్టుబడి పెట్టింది.అది కాస్త 2018-2019 లో 46 లక్షలకు పెరిగిందని ఈడీ అధికారుల విచారణలో తేలింది.
ఆమె సంపాదించే దాని కంటే ఆమె ఫిక్స్ చేసిన డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయని ఈడీ అధికారులు కనుకొన్నారు.అయితే ఆర్ధిక లాబాదేవిల గురించి తనకంటే తన అకౌంటెంట్ కు బాగా తెలుసు అని అతన్ని వివరాలు అడగాలని రియా సూచించినట్టు సమాచారం.
అంతేకాదు ఆమె ముంబైలో కొన్న ఫ్లాట్ కు సంబంధిచిన ఆధారాలను కూడా చూపులేదని ఈడీ అధికారులు వెల్లడించారు.