వైకాప అధినేత.గౌరవ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఒకింత ఇబ్బందికరంగానే కనిపిస్తుంది.
అందరితో నవ్వుతూ, అస్సెంబ్లీ సమావేశాల్లో తనదైన శైలిలో విరుచుకుపడుతున్న జగన్ పై ఆక్రమాస్తుల కేసు ఉచ్చు బలంగానే బిగుసుకుంటుంది.గతంలో సీ.బీ.ఐ సైతం జగన్ ను ముప్పు తిప్పలు పెడితే.ఇప్పుడు మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ.డీ సైతం జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.అయితే ఇప్పటి వరకు ఈ సంస్థ డిల్లీ కేంద్రంగా తమ కార్యకలాపాలు చేస్తూ ఉండడంతో దర్యాప్తు ఆలస్యం అవుతుంది అని, ప్రతీసారి ఈ కేసు విషయమై డిల్లీ నుంచి రావాల్సి వస్తుండగా, అలాంటి ఇబ్బందులు ఏమీ కలగ కుండా ఈ కేసును హైదరాబాద్ బ్రాంచ్ కు బదిలీ చేయడంతో దర్యాప్తు మరింత వేగమై జగన్ ను మరోసారి కట కటాల వెనక్కి నెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నాయి జగన్ వ్యతిరేక వర్గాలు.ఇక సీ.బీ.ఐ పెట్టిన చార్జ్ షీట్స్ ను పరిగణలోకి తీసుకుని పని ప్రారంభించిన ఈ.డీ దూకుడు చూస్తుంటే మరో 3నెలల్లో ఈ కేసును పూర్తి చేసి జగన్ ను ముద్దాయిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి.ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మరోసారి జగన్ జైలుకు వెళితే మాత్రం పార్టీకి దేవుడే దిక్కు.