దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో తాజాగా అరెస్ట్ చేసిన వ్యాపార వేత్త అమిత్ అరోరాను ఈడీ ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనుంది.
అమిత్ అరోరా కస్టడీకి అనుమతించాలన్న ఈడీ వాదనలతో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఏకీభవించింది.ఈ మేరకు అరోరాను వారం రోజులపాటు కస్టడీకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.