సీఎం జగన్ కు ఈడీ కోర్టు నోటీసులు..!!

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఈడీ కోర్టు సమన్లు జారీచేసింది.జనవరి 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వార్త సంచలనం అయింది.

 Ed Court Summons Jagan, Vijay Sai, Hetero, Aurobindo Reddy,ed Court ,ys Jagan, C-TeluguStop.com

అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అవ్వటం అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో రబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ న్యాయస్థానం జగన్ తో పాటు కేసులో A2 గా వున్న విజయసాయిరెడ్డి అదే విధంగా హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అరబిందో ఎండి నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు తాజాగా ఈడీ న్యాయస్థానం కోర్టు సమన్లు జారీ చేసింది.

పరిస్థితి ఇలా ఉండగా ముఖ్యమంత్రి అయిన నాటినుండి వైయస్ జగన్ విచారణకు హాజరు కాలేనని నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ సమయంలో న్యాయస్థానాలకు వివరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా ఈడి కోర్టు ఆదేశాలకు సీఎం వైఎస్ జగన్ విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube