టీ.ఆర్.ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరెట్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు.మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటుగా మరో ఐదు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు.ఖమ్మంలో కీలక నేత అయిన నామా నాగేశ్వర రావు ఇళ్లు, ఆఫీస్ ల మీద ఈడీ సోదాలు షాక్ ఇస్తున్నాయి.
మధుకాన్ డైరక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం.రాంకీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను తప్పుదారి పట్టించారనే అభియోగాల మీద ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఆ సంస్థల బ్యాంక్ ఖాతాలు, డాక్యుమెంట్స్, కాంట్రాకులకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.సోదాలతో నామా నాగేశ్వ రావ్వు ఇళ్లు, ఆఫీసులలో కొద్దిపాటి హడావిడి కొనసాగుతుంది.
అయితే ఈడీ సోదాల్లో ఎలాంటి వివరాలు సేకరిస్తారు.రుణాలు తీసుకుని నిజంగానే వాటిని తప్పుదారి పట్టిచినట్టు ఆదారాలు సేకరించారా.
వీటి వివరాలు సోదాలు పూర్తయిన తర్వాత తెలుస్తాయి.