సాక్షి పత్రిక…ఒక బలమైన సామాజిక వర్గానికి మాస పుత్రిక లాగా సాగుతున్న ఈ సాక్షి పత్రిక జగన్ కు ఆయుధంలా ఎప్పటికప్పుడు సహాయపడుతూనే ఉంది.అయితే ప్రస్తుతం ఉన్న పత్రికలన్నీ అధికారం పక్షానికి దాశాఓహం అంటాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక ఇదే క్రమంలో తనను తాను కాపాడుకోవడానికి…ప్రత్యర్థులపై విరుచుకు పడటానికి జగన్ సాక్షి పేపర్ చాలానే సహకరిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సాక్షి కి చిక్కులు పడేలా కనిపిస్తుంది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విడతల వారీగా జగన్ ఆస్తులు జప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇదే క్రమంలోమనీ ల్యాండ్ రింగ్ కేసు వ్యవహారంలో తాజాగా 230 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక తాజాగా జప్టు చేసిన అక్రమ ఆస్తుల్లో.కడప జిల్లాలోని సాక్షి యూనిట్ ప్రింటింగ్ కార్యాలయం కూడా ఉంది.దాదాపుగా 2.11 ఎకరాలలో ఉన్న ఈ కార్యాలయం ఆస్తులను ఈడీ లేటెస్టుగా అటాచ్ చేసింది.జననీ ఇన్ప్రా లిమిటెడ్ పేరుతో ఉన్న ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.అయితే ఈ ఒక్కటి మూయడం వల్ల సాక్షి పత్రికకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు అని చెబుతుంది యాజమాన్యం.
అది నిజమే కానీ…ఇదే క్రమంలో భవిష్యత్తులో మిగిలిన యూనిట్లపై కూడా ఈడీ దాడులు చేసి స్వాడినం చేసుకుంటే అక్కడ పని చేసే వారి పరిస్థితి ఏంటో అని అందరు ఆందోళన చెందుతున్నారు.ఏది ఏమైనా సాక్షి మునిగిపోతున్న నావ అంటుంది తెలుగుదేశం పార్టీ.