ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల విషయంలో మంచి దూకుడుగా వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ కాబోతున్నారు.
ఎన్నికల ఏర్పాట్లు అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి గవర్నర్ తో అదేవిధంగా చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ తో మంతనాలు జరపడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశం అయి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సరికొత్త ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లకు ఏర్పాటు అదేవిధంగా ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనలు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.భద్రతా పరమైన అంశాలపై కూడా జరగబోయే సమావేశాలలో చర్చించనున్నట్లు సమాచారం.