పెరుగు.అద్భుతమైన రుచి కలిగి ఉండటమే కాదు.బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్పరస్, ప్రోటీన్, విటమిన్ బి 2, విటమిన్ బి 12, విటమిన్ డి, రైబోఫ్లెవిన్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఇలా ఎన్నో పెరుగు ద్వారా పొందొచ్చు.
అందుకే ప్రతి ఒక్కరిని ప్రతి రోజు పెరుగు తీసుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.అయితే కొందరికి పెరుగు అసలు నచ్చనే నచ్చదు.కనీసం పెరుగును దగ్గరికి కూడా రానివ్వరు.
అలా అని పెరుగును పూర్తిగా విడిచి పెట్టేస్తే.
ఎన్నో పోషకాలు కోల్పోతారు.మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతారు.
అందు వల్ల, ఇప్పుడు చెప్పే విధంగా పెరుగు తీసుకుంటే.పోషకాలకు పోషకాలు, ప్రయోజనాలకు ప్రయోజనాలు పొందొచ్చు.
పెరుగును డైరెక్ట్గా తీసుకోలేని వారు.అందులో కాస్త తేనె కలిపితే టేస్ట్ పెరుగుతుంది.
మరియు తేనె కలిపిన పెరుగును తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి.శరీరం చల్లబడుతుంది.
అలాగే పెరుగును నేరుగా తీసుకోలేని వారు.అందులో కొద్దిగా వాము పొడి మరియు జీలకర్ర పొడి వేసి తీసుకోండి.వాము, జీలకర్ర కలపడం వల్ల పెరుగు రుచి పెరుగుతుంది.పైగా జీర్ణ సంబంధిత సమస్యలు పరార్ అవుతాయి.మరియు శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
పెరుగులో అరటి పండు మరియు బ్రౌన్ షుగర్ కలిపితే.
ఎంత ఇష్టం లేని వారైనా ఇష్టపడి తింటారు.అంతేకాదు, పెరుగులో బ్రౌన్ షురగ్, అరటి పండు యాడ్ చేసి తినడం వల్ల.
బోలెడన్ని పోషకాలు అందడంతో పాటుగా శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.
ఇక పెరుగును డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వారు.అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకోవచ్చు.ఇలా చేస్తే శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.
వైరస్లు దరి చేరకుండా ఉంటాయి.చర్మ కాంతి పెరుగుతుంది.
మరియు కీళ్ల నొప్పులు కూడా దూరం అవుతాయి.