ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలను సోమవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం కుదిపేసింది.ఇది రెక్టార్ స్కేలు మీద 7.7 గా నమోదు అయింది.ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ కుష్ పర్వత శ్రేణి ప్రాంతం.దేశ రాజధాని దిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
ప్రజలు భయ భ్రాంతులై రోడ్లమీద పరుగులు తీశారు.దిల్లీలో జనం ఇళ్ళ నుంచి, ఆఫీసుల నుంచి రోడ్ల మీదకు వచ్చారు.పాకిస్తాన్లోనూ భూమి కంపించింది.అక్కడ పది మంది గాయ పడ్డారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ భూ కంపం వివరాలు కనుక్కున్నారు.అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
భూకంపం వచ్చిన రాష్ట్రాల్లో ప్రజలు ఇంకా రోడ్ల మీదనే ఉన్నట్లు సమాచారం.ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
దిల్లీలో మెట్రో రైళ్ళు ఆపేశారు.కాశ్మీర్ ప్రజలు 2005 లో సంభవించిన భూకంపం గుర్తుకు తెచ్చుకున్నారు.
ప్రాధమిక సమాచారం ప్రకారం 10 మంది చనిపోయినట్లు, 150 మంది గాయపడినట్లు తెలుస్తోంది.