ఏపీలోని రెండు జిల్లాల్లో భూమి కంపించింది.ప్రకాశం జిల్లా పామూరు మండలంలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.
పామూరు పరిసర గ్రామాల్లో సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
అటు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, కొండాపురం మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది.వింజమూరు, వరికుంటపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి.
దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.