హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు ఇప్పటికే నగర ప్రజలు కోలుకోలేని స్థితిలోకి వెళ్లారు.వర్షం వస్తుందంటే చాలు ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకొని బ్రతికిన సంఘటన మనకు తెలిసిందే.
ఆ సమయంలో బొరబండ ప్రాంతంలో వర్షం తో పాటుగా భూ కంపాలు కూడా వచ్చాయంట.క్షణ క్షణం భయంతో చస్తు బ్రతికినట్లుగా స్థానికులు చెప్పారు.తాజాగా ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు కూకట్ పల్లి ప్రాంతంలోని ఆస్బెస్టాస్ కాలనీలో భూమి కంపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
భూమి లోపల నుండి పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపించయని అక్కడ స్థానికులు చెబుతున్నారు.రెండు మూడు సెకండ్ల పాటుగా భూమి కంపించిందంట.ప్రాణ భయంతో స్థానికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.ఒక్క విపత్తు తర్వాత మరో విపత్తు అన్నట్లుగా హైదరాబాద్ ప్రజలను ప్రకృతి బయపెడుతుంది.