శ్రీకాకుళం జిల్లా రాజాంలో భూమి స్వల్పంగా కంపించింది.దీంతో ఒక్కసారిగా గా ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు.
ఈ హఠాత్ పరిణామానికి స్థానికులంతా ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.రాజాం పట్టణంలోని అమ్మవారి కాలనీలో ఈ ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయి.
ఈ సంఘటనతో ఒక్కసారిగా జిల్లా వాసులు ఉలిక్కి పడ్డారు.
గతంలోనూ రాజాంలో ఇదేవిధంగా భూమి కంపించింది సంఘటనను అనేకం చోటు చేసుకున్నాయి.
గతేడాది అక్టోబర్ లో అమ్మవారి కాలనీలో భూమి ఇదే విధంగా కంపించిందని స్థానికులు చెబుతున్నారు.ఇక జిల్లాలోని ఇచ్ఛాపురం కవిటి మండలాల్లో గతంలో అన్నిసార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.