దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి సమయంలో దేశ రాజధానిగా ఢిల్లీ ఎంత మేరకు కరెక్ట్ కాదంటూ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చాయి.నేపాల్ మరియు ఇండియా బోర్డర్ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
దాని ప్రభావం ఇండియా మరియు నేపాల్లో కూడా కనిపించిందని ప్రకటించారు.
రిక్టర్ స్కేల్పై 5.1 గా ఈ భూకంప తీవ్రతను గుర్తించారు.ఢిల్లీతో పాటు ఉత్తరఖండ్, ఉత్తర ప్రదేశ్ ఇంకా పలు ఉత్తర భారత దేశ ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఢిల్లీలో అధికంగా భూకంపం ఉందని గుర్తించారు.భూకంపం అంటూ వార్తలు వచ్చిన వెంటనే ఢిల్లీ వాసులు అంతా కూడా ఇంటి బయటకు వచ్చారు.గంటల తరబడి ఇంటి బయటే ఉన్నారు.ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఇంట్లోంచి బయటకు వచ్చేసి కొన్ని గంటల పాటు వీధుల్లో కూర్చున్నారు.