ఈ భూమిపై ( Earth ) జీవించడానికి ప్రతిఒక్కరికీ హక్కు ఉంది.మనుషులకు ఎంత అయితే హక్కు ఉందో.
మిగతా జీవరాసులకు కూడా అంతే హక్కు ఉంది.మనుషులకు ఒక్కరికీ భూమి సొంతం కాదు.
అన్నింటికీ స్వేచ్చగా జీవించే హక్కు ఉందని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. కానీ మనుషులు భూమి మనకే సొంతం అనుకుని నాశనం చేస్తున్నారు.
భూమికి, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తూ భూమికి ముప్పు తీసుకొస్తున్నారు.గాలి కాలుష్యం,( Air Pollution ) ప్లాస్టిక్ వాడకం.
( Plastic ) ఇలా చాలా పనుల వల్ల భూమికి ముప్పు తీసుకొస్తున్నారు.
భూమి ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణాలపై 40 మందితో కూడిన అంతర్జాతీయ సైంటిస్టుల టీమ్ ఒక రీసెర్చ్ నిర్వహించింది.ఈ పరిశోధనలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటపడ్డాయి.మానవులు చేసే పనుల వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనే విషయాలు అంచనా వేశారు.
అసలు ఎవరూ జీవించడానికి వీలు కాకుండా, నివాసానికి అమోదయోగ్యం కానంతగా భూమిని దారుణంగా మార్చేశారని తేల్చారు.ఈ మేరకు సైంటిస్టులు తయారుచేసి నివేదికను తాజాగా నేచర్ జర్నల్ ప్రచురించింది.
మానవుల చేసే పనుల వల్ల భూమి ప్రమాదకర స్ధితికి చేరుకుందని, డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయని సైంటిస్టులు తమ నివేదికలో తెలిపారు.తూర్పు యూరప్, దక్షిణాసియా, ఆఫ్రికా, బ్రెజిల్, తూర్పు యూరప్ లాంటి దేశాలు డేంజర్ స్పాట్స్కు నిలయాలుగా మారుతున్నాయని పొందుపర్చారు.అలాగే అమెరికార, మెక్సికో, చైనాలోని చాలా ప్రాంతాలు కూడా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, జీవరాశున ఉనికికే ప్రమాదం అనిపింపచేలా పరిస్థితులు ఉన్నాయని తేల్చారు.భూమి భద్రతకు సంబంధించి 8 రకాల సూచీల్లో ఏడు సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేశాయని చెబుుతున్నారు.
మూడుకు మంచి సూచీలు పరిమితిని దాటితే ప్రమాదం తప్పదని, ఇప్పుడు భూమి అదే పరిస్థితిలో ఉందని అంటున్నారు.