మనలో ప్రతి ఒక్కరికీ డబ్బులు సంపాదించాలని ఉంటుంది.ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే అంత సౌకర్యవంతమైన జీవనం సాగించవచ్చు.
రోజురోజుకు ధరలు మండిపోతున్న నేపథ్యంలో మనిషి జీవితంలో డబ్బుకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.కరోనా, లాక్ డౌన్ వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోగా చాలా కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో 30 నుంచి 40 శాతం వరకు కోత విధించాయి.
దీంతో ప్రజలు సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.ఇలాంటి సమయంలో ఒక కంపెనీ ఇంట్లో కూర్చుని బ్రాండెండ్ దుస్తులు ధరించి టీవీ చూస్తూ డబ్బులు సంపాదించే అవకాశం కల్పిస్తోంది.
తమ బ్రాండ్ ను వినూత్నంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.బ్రిటన్ దేశానికి చెందిన పౌర్ మోయి అనే ప్రముఖ కంపెనీ చిల్ అవుట్ రివ్యూవర్ పేరుతో ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.
బ్రిటన్ దేశానికి చెందిన కంపెనీ ఆఫర్ ను ప్రకటించినప్పటికీ ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.కంపెనీ యొక్క ఉత్పత్తులను పరిశీలించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చిపెట్టింది.
ఈ జాబ్ కు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.అక్టోబర్ 12 దరఖాస్తు చేయడానికి చివరి రోజు.
కంపెనీ దుస్తులు ధరించి రోజుకు పది గంటల పాటు టీవీ చూస్తూ నచ్చినట్టుగా ఉంటూ భారత కరెన్సీ ప్రకారం రోజుకు 22 వేల రూపాయలను పొందవచ్చు.
ఎవరైతే ఈ ఆఫర్ కు ఎంపికవుతారో వాళ్లు కంపెనీ ఇచ్చిన దుస్తులను మార్చుకుంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేయాల్సి ఉంటుంది.
ఈ జాబ్ కు ఎంపికైన అభ్యర్థి పేరును వచ్చే నెల 26వ తేదీన ప్రకటిస్తామని పేర్కొంది.ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించే అవకాశం కావడంతో చాలామంది ఉద్యోగులు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.