అమెరికాలో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్నారై గుమ్మడికాయల ద్వారకనాథరెడ్డి నిన్న మద్యాహ్నం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లికి చెందిన ద్వారకనాథరెడ్డి చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాడు.
భారత కాలమాన ప్రకారం గురువారం మద్యాహ్నం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ద్వారకనాథరెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మరియు ఉద్యోగం గురించి ఆందోళన లేదు అంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆత్మహత్యకు కారణం ఏంటీ అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.ద్వారకనాథరెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆయన మరణంతో మట్లివారి పల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.
మరో వైపు ద్వారకనాథరెడ్డి మృతదేహంను ఇండియాకు తెప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారు.