సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పండుగ సమయాలలో ఎక్కువ సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.ఇక పండుగలు వస్తున్నాయి అంటే స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఆ సమయంలోనే సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు.
ఇక తాజాగా దసరా పండుగ సందర్భంగా పలు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.అయితే ఈసారి దసరా పండుగకు స్టార్ హీరోలు సైలెంట్ అయిపోయారు.
ఇండస్ట్రీలో దసరా, ఉగాది,సంక్రాంతి లాంటి పండుగలకు హీరో నుంచి పెద్ద హీరోల వరకు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు టీజర్లను సినిమాలను విడుదల చేస్తూ హంగామా చేస్తూ ఉంటారు.
ఇక పండుగ వాతావరణం సమయంలో థియేటర్ల వద్ద మరింత పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.
అయితే ఈసారి దసరా పండుగకు టాలీవుడ్ అగ్ర హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున పోటీపడ్డారు.ఈ ఇద్దరు హీరోలు కూడా తగ్గేదేలే అంటూ పోటాపోటీగా సినిమాలను విడుదల చేశారు.
ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు విడుదల అవ్వడంతో పాటు ఇతర సినిమాలకు సంబంధించిన పోస్టర్లు టీజర్లు భారీగానే విడుదల అయ్యాయి.కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా రామ్ చరణ్,అల్లు అర్జున్,ఎన్టీఆర్,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
అయితే పండుగకు రెండు రోజుల ముందే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.రామ్ చరణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ కానీ లుక్ కానీ ఎటువంటి అప్డేట్ ను విడుదల చేయలేదు.మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో ప్రస్తుతం దసరా మూడ్ లో లేరు.ఎన్టీఆర్ కూ సంబంధించిన కొత్త సినిమాలను ఇంకా మొదలు పెట్ట లేదు.
ఇక అల్లు అర్జున్ పుష్ప టు సంబంధించిన షూటింగ్ కూడా ఇంకా మొదలు కాలేదు.పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్లు సినిమా గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.
అయితే స్టార్ హీరోల సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ దసరా పండుగ ఉండిపోయారు.