మహానటి సావిత్రి సినిమాతో మలయాళీ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులందరికి చేరువ అయిపోయాడు.ఇక దుల్కర్ కేవలం మలయాళీ ఇండస్ట్రీకి పరిమితం కాకుండా తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే బాలీవుడ్ లో కూడా దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇచ్చేసాడు.ఇదిలా వుంటే ఇప్పుడు దుల్కర్ తన నెక్స్ట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
మాహానటి తర్వాత తెలుగు సినిమాలు చేయడానికి కూడా దుల్కర్ ఆసక్తి చూపించాడు.
ఇదిలా వుంటే తాజాగా యాత్ర సినిమాతో సూపర్ హిట్ కొట్టి, చాలా గ్యాప్ తర్వాత మలయాళీ స్టార్ హీరో మాంముట్టిని టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు మహి వి రాఘవ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు.
తాజాగా మమ్ముట్టి తనయుడు దుల్కర్ ని కలిసి మహి స్టొరీ నేరేట్ చేయడం అతను కూడా ఒకే చెప్పడం జరిగిందని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో దర్శకుడు మహి వి రాఘవ ఉన్నాడని తెలుస్తుంది.
మరి ఇప్పటికే తండ్రికి హిట్ ఇచ్చిన మహి ఇప్పుడు కొడుకుతో సినిమా ప్లాన్ చేయడం విశేషం.