దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర ద్వారా సందడి చేసిన ఈయన ప్రస్తుతం సీతారామం సినిమాతో ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఈ విధంగా ఈయన నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా మంచి హిట్ అవడంతో తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
హనురాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే ఈయనకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా అవకాశం కల్పించినట్టు సమాచారం.ఇప్పటికే శేఖర్ కమ్ముల దుల్కర్ సల్మాన్ కు కథ వివరించగా ఆయనకు కథ నచ్చి తనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే శేఖర్ కమ్ముల ఇదివరకే కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా అనంతరం ధనుష్ శేఖర్ కమ్ముల షూటింగ్ పనులను ప్రారంభించనుంది.
ఇక ఈ సినిమా పూర్తయ్యేలోగా కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల మరొక హీరోతో సినిమా చేయాలని భావించారట.
అందుకే దుల్కర్ సల్మాన్ కి కథ వినిపించడంతో ఆయన ఈ సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.