మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన సీతారామం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కు అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ను అశ్వనీ దత్ కూతురు స్వప్న దత్ భారీ బడ్జెట్తో నిర్మించారు.ఈ సినిమా కోసం రష్యా లోని అత్యంత కఠినమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఏ సినిమా కూడా షూటింగ్ అక్కడ చేయలేదని.ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు కచ్చితంగా సర్ప్రైజింగ్ గా కనిపించడం తో పాటు వింత అనుభూతిని కలిగిస్తాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించారు.దాదాపు మూడు వారాల పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఊపిరి సలపకుండా ఇంటర్వ్యూ లతో హడావుడి చేశారు.తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా బాహుబలి స్టార్ ప్రభాస్ రావడం తో సినిమా స్థాయి మరింత పెరిగినట్లు అయిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా కు ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని, సినిమా విడుదలయ్యాక మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన కీలక పాత్ర లో నటించడం వల్ల కూడా అంచనాలు మరింతగా పెరిగాయి అనడం లో సందేహం లేదు.ఇప్పటి వరకు ఈ సినిమా విషయం లో అన్నింటా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది.
పాటలకు మంచి స్పందన దక్కింది, కనుక సినిమా కూడా పాజిటివ్ గానే ఉంటుందని అంతా నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమా కు పోటీగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార విడుదల కాబోతుంది.
మరి ఆ సినిమా పై పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.