దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కలిసి నటించిన తాజా చిత్రం సీతారామం.భారీ అంచనాల నడుమ ఈ సినిమా తాజాగా ఆగస్టు 5న విడుదల అయింది.
అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు డార్లింగ్ ప్రభాస్ వచ్చి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఈ సినిమా గురించి పొగడడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
కానీ సినిమా విడుదలైన తరువాత పరిస్థితి మరొక విధంగా ఉంది.సీతారామం సినిమా కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో స్టోరీ పాతదే అయినప్పటికీ దర్శకుడు హను రాఘవపూడి కొత్తగా చూపించాడు.
కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకం పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఇది ఒక పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామా అని డైరెక్టర్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.తాజాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది.
కాగా ఈ సినిమాలో ముందు నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన అంశాలు కొన్ని మిస్ అయ్యాయట.అంతేకాకుండా సినిమా మొత్తం ఎక్కువగా రష్మిక పాత్రనే ఎక్కువగా ఉందట.
రష్మిక పాత్ర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమె పాత్ర మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదట.అయితే ఇందులో పేరుకే మృణాల్ ఠాకూర్ హీరోయిన్,కానీ స్క్రీన్ స్పేస్ అంతా కూడా రష్మికనే కనిపిస్తుంది.
దుల్కర్ సల్మాన్ తన నటనతో మెప్పించినప్పటికి సినిమా కథ మాత్రం స్లోగా సాగడంతో జనాలకు విసుగు తెప్పించాడు డైరెక్టర్.అయితే ఇదే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని అంటున్నారు.అలాగె సినిమాలో సాఫీగా సాగిపోతున్న కథ లోకి అనవసరపు క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి కథను తప్పు దారి పట్టించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.జనాలు.ఇక రొమాన్స్ టైంలో న్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.మొత్తానికి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద యావరేజ్ గా నిలిచింది అనే చెప్పవచ్చు.
తాజా వార్తలు