తెలంగాణలో సరికొత్త రాజకీయ వ్యూహానికి తెర లేపినట్టుగా తెలుస్తోంది.ఇప్పటికీ ఎవ్వరూ ఇంతలా కేసీఆర్ వ్యూహాలకు, ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ కు ధీటైన జవాబు ఇస్తున్నాడనే చెప్పవచ్చు.
అయితే మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేశాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ అత్యవసర విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.అయితే విచారణకు ఆదేశించిన రెండు రోజులలోనే మంత్రి పదవి నుండి కూడా భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే ఈ విషయంపై కేసీఆర్ పై పెద్ద ఎట్టున విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే కేసీఆర్ తో విభేదించిన తరువాత భట్టి, డీఎస్ లాంటి నేతలతో ఈటెల సమావేశమయ్యారు.
ఈ డీఎస్ తో జరిగిన సమావేశంలో ఈటెలకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.టీఆర్ఎస్ తో విభేదించి వచ్చిన వారిలో ఎవ్వరికి రాని సానుభూతి నీకు వచ్చిందని, అయితే ఈ సమయంలో నీతో నిజాయితీ ఉన్న నాయకులు ఉంటారని, నిన్ను ఆవేశపరిచే వాళ్ళు ఉంటారని, అయితే ఈ సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలని డీఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సూచించినట్టు తెలుస్తోంది.