ఈ కాలంలో చాలామంది పొడి చర్మంతో బాధపడుతుంటారు.ముఖం పొడిగా ఉంటే చర్మం కాంతివిహీనంగా, గరుకుగా ఉండి మృదుత్వాన్ని కోల్పోతుంది.
తద్వారా ముఖం అందహీనంగా కనిపిస్తుంది.వాస్తవానికి ఒంట్లో తేమ తగ్గడం కారణంగా చర్మం పొడిబారుతుంటుంది.
ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.మార్కెట్లో దొరికే అనేక క్రీములు, లోషన్స్ కొనుగోలు చేసి.
వాడుతుంటారు.కానీ, ఫలితం లేక బాధపడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్స్ యూజ్ చేస్తే.ఖచ్చితంగా పొడిచర్మానికి చెక్ పెట్టవచ్చు.అందులో ముందుగా బాగా పండిన అరపండును పేస్ట్ చేసి.అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకుని.పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఈ ప్యాక్ చర్మానికి తేమను అందిస్తుంది.తద్వారా పొడిబారిన చర్మం.
మృదువుగా, కోమలంగా మారుతుంది.
మాయిశ్చరైజర్లు లేని కాలంలో చాలామంది మహిళలు మీగడ ముఖానికి రాసుకునేవారు.
వాస్తవానికి మీగడ పొడి చర్మాన్ని నివారించడంలో గ్రేట్గా సహాపడుతుంది.మీగడ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండదు.
అందుకు ప్రతిరోజు కాస్త మీగడ తీసుకుని.ముఖానికి అప్లై చేసి.కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తొక్కతో ఆపిల్ ముక్కలను మెత్తని పేస్ట్ గా తయారుచేసి దానిలో తేనే వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకుని.
ఆరిన తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల ముఖం మృదువుగా మారడంతో పాటు మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.ఇక శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం పొడిబారుతుంది.పెదవులు చిట్లిపోతాయి.కాబట్టి, నీటిని ఎక్కువగా తాగాలి.