పొడి చర్మం కలవారికి గుడ్డు తెల్లసొన,తేనే మంచి ఫలితాన్ని ఇస్తాయి.అలాగే మన ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో కూడా ప్యాక్ లను వేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ ప్యాక్ ల గురించి తెలుసుకుందాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్,ఐదు చుక్కల పనీర్,గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి.
ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక స్పూన్ పెసరపిండిలో చిటికెడు పసుపు వేసి సరిపడా నీటిని పోస్తూ పేస్ట్ గా చేయాలి.
ఈ పేస్ట్ ని ముఖానికి,మెడకు రాసి ఆరిన తర్వాత తడి చేసి వలయాకారంలో రుద్దుతూ కడగాలి.
ఈ ఫ్యాక్స్ చర్మాన్ని సున్నితంగా మృదువుగా మార్చటమే కాకుండా చర్మం మీద ఉన్న మురికిని తొలగిస్తాయి.
చర్మం ఎక్కువగా పొడిగా ఉంటే మాత్రం ఒక స్పూన్ పెసరపిండిలో పసుపు,పాలు లేదా పాల మీగడ వేసి కలిపి ఉపయోగించాలి.ఈ ప్యాక్ లను తరచుగా వాడుతూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
.