విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో దృశ్యం2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.దృశ్యంకి సీక్వెల్ గా ఈ సినిమాని తెరపై ఆవిష్కరిస్తున్నారు.
మలయాళంలో రీసెంట్ గా దృశ్యం ఒరిజినల్ వెర్షన్ సీక్వెల్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే వచ్చింది.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
మొదటి పార్ట్ కి మించి ఉత్కంఠ కలిగించే విధంగా దృశ్యం సీక్వెల్ ఉందనే అభిప్రాయం విమర్శకుల నుంచి వినిపించింది.జీతూ జోసెఫ్ రైటింగ్ టాలెంట్ ని మరోసారి చూపించాడని ప్రశంసించారు.
ఈ నేపధ్యంలో సురేష్ బాబు జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే తెలుగులో దృశ్యం సీక్వెల్ ని తెరకెక్కించడానికి రెడీ అయ్యి చాలా వేగంగా సెట్స్ పైకి వెళ్ళడమే కాకుండా సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కేరళలో జరుగుతుంది.
ఈ నెల ఆఖరుకి ఈ సీక్వెల్ షూటింగ్ పూర్తయిపోతుందని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేసి రిలీజ్ కి రెడీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సీక్వెల్ రిలీజ్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసారని తెలుస్తుంది.
జూన్ 20న సినిమాని థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని బోగట్టా.
మొదటి భాగంలో నటించిన వారే ఈ సీక్వెల్ లో కొనసాగుతున్నారు.వారితో పాటు సంపత్ రాజ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఈ సీక్వెల్ తో వెంకటేష్ ఖాతాలో మరో హిట్ పడినట్లే అనే టాక్ వినిపిస్తుంది.