మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని అందుకున్న క్రైమ్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ దృశ్యం.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకోవడంతో పాటు సుమారు ఇండియన్ బాషలన్నింటిలో రీమేక్ అయ్యింది.
రీమేక్ అయిన అన్ని బాషలలో సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక చైనా భాషలో కూడా దృశ్యం రీమేక్ చేశారు.
ఇక ప్రతి భాషలో ఈ సినిమాలో నటించిన హీరోలకి మంచి గుర్తింపు వచ్చింది.తన భార్య, కూతురు చేసిన హత్య నుంచి వారిని కాపాడుకునే తండ్రి పాత్రలో మోహన్ లాల్ జీవించేశారు.
సింపుల్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని మెస్మరైజ్ చేశారు.ఇంత పెద్ద హిట్ అయిన దృశ్యం మూవీకి సీక్వెల్ ప్రస్తుతం తెరకెక్కింది.
ఈ సినిమా షూటింగ్ కూడా దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసేశాడు.మొదటి సినిమాలో నటించిన వారే ఇందులో కూడా నటించారు.
ఇక మొదటి సినిమాకి కొనసాగింపుగానే ఈ కథాంశం ఉంది.
తాజాగా మలయాళీ రీమేక్ దృశ్యం టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కొత్తగా కట్టిన పోలీస్ స్టేషన్ క్రింద హీరో పాతిపెడతాడు.అయితే తమ కొడుకు ఆచూకీ తెలుసుకోవాలని పోలీస్ ఆఫీసర్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
ఆ ప్రయత్నంలో తమ కొడుకు చనిపోయాడానే విషయం వారికి తెలుస్తుంది.సమాధి అయిన నిజాలని బయటపెట్టడానికి పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు, వారి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో చేసే ఆలోచనలతో సినిమా కథాంశం ఉండబోతుందని దర్శకుడు టీజర్ ద్వారా చెప్పేశాడు.
సినిమాని థియేటర్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.ఇక ఇతర బాషలలో ఈ సినిమాని రీమేక్ చేస్తారా లేక డబ్బింగ్ చేసి విడిచిపెడతారా అనేది వేచి చూడాలి.