ఓటీటీ రిలీజ్ కి తెలుగు దృశ్యం 2

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టేశాడు.రెండు రీమేక్ సినిమాలతో పాటు ఒక సీక్వెల్ లైన్ గా ఉన్నాయి.

 Drushyam 2 Telugu Remake In Ott Release, Venkatesh, Actress Meena, Jeethu Joseph-TeluguStop.com

అసురన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్నాడు.

ఇక మలయాళీ హిట్ మూవీ దృశ్యం2 రీమేక్ కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

ఈ రెండు సినిమాలు ఇప్పటికే సూపర్ హిట్ అందుకున్నవి కావడం, ఎలాంటి మార్పులు లేకుండా మక్కీకి మక్కీగా తెలుగులో తెరకెక్కించడంతో ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇదిల ఉంటే మలయాళీ దృశ్యం 2 మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒటీటీలో రిలీజ్ అయ్యే హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే తెలుగు దృశ్యం 2 మాత్రం థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ముందు నుంచి సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు.అయితే కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో మరోసారి థియేటర్స్ పూర్తిగా మూతబడిపోయాయి.

అలాగే ఏపీలో టికెట్ ధరలని కూడా వైసీపీ ప్రభుత్వం తగ్గించేసింది.ఈ నేపధ్యంలో నారప్ప థియేటర్ రిలీజ్ చేసి, దృశ్యం2 మూవీని ఒటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

దీనిని కూడా అమెజాన్ ప్రైమ్ కి ఇప్పటికే మంచి ధరకి అమ్మేసినట్లు తెలుస్తుంది.త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రావడంతో పాటు వచ్చే నెలలోనే దృశ్యం ఒటీటీ రిలీజ్ ఉండే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube