మలయాళీ సూపర్ హిట్ మూవీ దృశ్యంకి సీక్వెల్ గా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లీల్, మీనా కాంబినేషన్ లో దృశ్యం 2 మూవీ తెరకెక్కింది.తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా పెర్ఫెక్ట్ సీక్వెల్ అనే ప్రశంసలు లభిస్తున్నాయి.ఎక్కడ ముగిసిందో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసి కథని చెప్పడం నిజంగా గొప్ప విషయం అనే అభిప్రాయం వినిపిస్తుంది.
జీతూ జోసెఫ్ మరోసారి తన కాలానికి పని చెప్పి అద్బుతమైన కథ, కథనంతో ప్రేక్షకులని మెప్పించాడు.ఇదిలా ఉంటే ఈ దృశ్యం 2 మలయాళంలో మొదలైనప్పటి నుంచి తెలుగులో వెంకటేష్ హీరోగా సీక్వెల్ గురించి చర్చ నడుస్తుంది.
అయితే వెంకటేష్ మాత్రం నారప్ప షూటింగ్ లో ఉండి దృశ్యం సీక్వెల్ గురించి ఆలోచించలేదు.అయితే ఇప్పుడు ఈ మలయాళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వెంటనే సురేష్ బాబు, వెంకటేష్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దృశ్యం 2 తెలుగు సీక్వెల్ కి రెడీ అయిపోయారు.
ఒరిజినల్ తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దగ్గర ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ ఉండటంతో దానికి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రాయాల్సిన అవసరం ఉంది.అందులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు.
ఈ నేపధ్యంలో అతని దర్శకత్వంలోనే తెలుగు సీక్వెల్ తెరకెక్కించడానికి అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేశారు.ఇక మార్చిలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించభోతున్నట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
మాతృక మాదిరిగానే దీనిని కూడా 45 నుంచి 50 రోజుల్లో పూర్తి చేసి అంతే వేగంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.సురేష్ బాబు మరో నిర్మాతతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా తెలుగు రీమేక్ లో ఎవరైతే నటించారో వారినీ ఈ సినిమాలో కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది.