ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.మద్య నిషేధాన్ని అమలు చేసే విధంగా .
మొదటిలో గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపిన జగన్ సర్కార్ పట్టణాలలో క్రమక్రమంగా బెల్టు షాపులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ టైమింగ్స్ కూడా తగ్గే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు.అంతమాత్రమే కాకుండా షాక్ కొట్టే రీతిలో మద్యం ధరలు పెంచడం కూడా జరిగింది.
ఇలాంటి తరుణంలో సీఎం జగన్ కి నంద్యాల నియోజకవర్గం లో తాగుబోతులు లెటర్ రాయటంతో .ఓట్లు లెక్కింపులో ఆ లెటర్ బయటపడింది.దీంతో ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ లెటర్ లో నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ .రాశారు.ఆ లెటర్ సారాంశం ఈ విధంగా ఉంది .మద్యం అమ్మకాల లో నూతన బ్రాండ్ లు .అయిన సుప్రీం, దారు , హైదరాబాద్, జంబో తదితరాలను తొలగించి.పాత బ్రాండ్లు అయిన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ వంటి రకాల అమ్మకాలు జరపాలని ” విన్నవిస్తూ సీఎం కి లెటర్ రాసాడు.పాత బ్రాండ్లు అమ్మకపోతే.
ఇదే తమ ఆఖరి ఓటు అవుతుందని అంటూ లెటర్ లో సదరు తాగుబోతు ఓటరు హెచ్చరించాడు.ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరి జగన్ తాగుబోతు లెటర్ పై స్పందిస్తాడో లేదో చూడాలి.
.