ఈ మందుబాబులకు మద్యం దొరికితే ప్రపంచాన్నే మర్చిపోతారు.అలానే ప్రపంచాన్ని మర్చిపోయి గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ మందుబాబు.
అసలు ఏమైందంటే? కడప జిల్లా చింతకొమ్మ దిన్నె సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్ నాయక్, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు బావి గట్టున కూర్చోని మద్యం సేవించారు.
అయితే తాగిన మత్తులో ఇద్దరు దేవుడు గురించి చర్చించుకున్నారు.
ఇంకా ఆ చర్చల్లో కిషోర్ నాయక్ దేవుడు ఉన్నాడని, రామాంజనేయులు దేవుడు లేడని వాదించాడు.ఆ సమయంలోనే కిషోర్ తాగిన మైకంలో పక్కనే ఉన్న బావిలో గంగమ్మ తల్లి ఉంటుంది అని ఆమెను చూపిస్తా అంటూ బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు.
ఆ సమయంలోనే బావి వద్ద ఉన్న ఓ రాయిపై కిషోర్ నాయక్ కాలు వెయ్యడంతో సుమారు 70 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయాడు.దీంతో ఆందోళనకు గురైన మరో వ్యక్తి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో పడ్డ వ్యక్తిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.ఇంకా ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.
దేవుడు ఉన్నాడు.లేడు అన్న ఇద్దరికీ ఈ దెబ్బకు దేవుడు కనిపించడు అంటూ కామెంట్లు చెప్పుకొచ్చారు.