దేవున్ని చూపిస్తా అన్నాడు.. 70 అడుగుల బావిలోకి!?

ఈ మందుబాబులకు మద్యం దొరికితే ప్రపంచాన్నే మర్చిపోతారు.అలానే ప్రపంచాన్ని మర్చిపోయి గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ మందుబాబు.

 Two Drunken Men Talked About God And One Man Fall Well, Drunken Men, God, Kadapa-TeluguStop.com

అసలు ఏమైందంటే? కడప జిల్లా చింతకొమ్మ దిన్నె సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్‌ నాయక్‌, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు బావి గట్టున కూర్చోని మద్యం సేవించారు.

అయితే తాగిన మత్తులో ఇద్దరు దేవుడు గురించి చర్చించుకున్నారు.

ఇంకా ఆ చర్చల్లో కిషోర్‌ నాయక్‌ దేవుడు ఉన్నాడని, రామాంజనేయులు దేవుడు లేడని వాదించాడు.ఆ సమయంలోనే కిషోర్ తాగిన మైకంలో పక్కనే ఉన్న బావిలో గంగమ్మ తల్లి ఉంటుంది అని ఆమెను చూపిస్తా అంటూ బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలోనే బావి వద్ద ఉన్న ఓ రాయిపై కిషోర్ నాయక్ కాలు వెయ్యడంతో సుమారు 70 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయాడు.దీంతో ఆందోళనకు గురైన మరో వ్యక్తి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో పడ్డ వ్యక్తిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.ఇంకా ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.

దేవుడు ఉన్నాడు.లేడు అన్న ఇద్దరికీ ఈ దెబ్బకు దేవుడు కనిపించడు అంటూ కామెంట్లు చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube