ఇద్దరి ప్రాణాలు బలిగొన్న డ్రంకెన్ డ్రైవ్.. !

మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే.అదీగాక పోలీసులు కూడా ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

 Drunken Drive That Killed Two Peopleshamshabad, Drunk And Drive, Accident Case,-TeluguStop.com

అయినా గాని మందుబాబులు అదేమి పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు.దీనివల్ల వారి ప్రాణాలు పోవడమే కాదు.అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.ఇంత జరుగుతున్నా గానీ ఏ ఒక్కరిలో కాస్త మార్పుకూడా రావడం లేదు.

ఇకపోతే శంషాబాద్ మండలం పెద్ద తూప్రా వద్ద చోటు చేసుకున్న సంఘటన ఇలాంటిదే.పీకల దాక తాగిన శ్యామ్ అనే యువకుడు నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి, నడుచుకుంటు వెళ్తున్న మహిళను ఢీ కొట్టడం తో, ఆ తీవ్ర గాయాలతో మహిళ అక్కడికక్కడే మరణించింది.

కాగా మహిళను ఢీకొట్టిన ఆ యువకుడు అదే స్పీడ్‌లో కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి, కరెంట్ షాక్ తో మృతి చెందాడట.ఇకపోతే బైక్ నడిపిన శ్యామ్, కుల్కచర్ల గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు.

ఇక ఈ ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.చూశారా డ్రంకెన్ డ్రైవ్ కారణంగా రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube