మద్యం మత్తులో మనుషులు ఏం చేస్తారో వారికే తెలియదు.కానీ ఒక్కోసారి వారు చేసే పనులు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తే మరొకసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
ఇప్పుడు ఓ తాగుబోతు చేసిన పని గురించి మీరు తెలుసుకుంటే ముక్కున వేలువేసుకోవడం పక్కనబెట్టి నోరెళ్లబెట్టడం ఖాయం.ఇంతకీ మనోడు చేసిన పనేంటో తెలుసా.
ఫూటుగా తాగినా కూడా చావుకే చుక్కలు చూపించాడు.
మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో గల రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడి ఉండటం గమనించారు కొందరు.
అయితే అతడు చనిపోయి ఉంటాడని భావించారు అందరూ.ఇంతలోనే అతడిపై నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రైళ్లు వెళ్లాయి.
దీంతో అతడి మృతదేహం తునాతునకలు అయ్యి ఉంటుందని భయపడ్డారు అక్కడి వారు.ఇది గమనించిన ఓ రైలు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో పోలీసులు అక్కడి వచ్చి ఆ మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.అప్పుడే వాళ్లు అవాక్కయ్యేలా మన మందుబాబు స్పృహలోకి వచ్చి తన తండ్రి వచ్చి తనను తీసుకెళ్తాడని చెప్పడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.సదరు మందు బాబు పేరు ధర్మేంద్ర అని.ఫూటుగా మందు తాగి రైలు పట్టాలపై పడుకున్నాడంటూ చెప్పుకొచ్చారు పోలీసులు.
అయితే అతడు మద్యం మత్తులో ఉన్నందున అతడిపై నుండి మూడు రైళ్లు వెళ్లాయనే విషయమే తనకు తెలియదని పోలీసులు ఆ విషయం చెప్పేసరికి మనోడి నోటివెంట మాటరాలేదు.ధర్మేంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత పోలీసులు అతడిని ఇంటికి పంపారు.
ఎంతైనా మందు బాబులు చేసే పనులు ఒక్కోసారి కొందరికి తలనొప్పిని తెప్పిస్తాయనడానికి ఇదో ఉదాహరణ.