బాపు పెళ్లి పుస్తకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయిన హీరోయిన్ దివ్యవాణి.ఆ సినిమాలో ఈ భామని చూసిన అందరూ ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయారు.
ఆ సినిమా ఒక్కసారిగా దివ్యవాణిని క్రేజీ హీరోయిన్ గా మార్చేసింది.అదే స్పీడ్ లో ఈమె చాలా సినిమాలు చేసింది.
అయితే రాజేంద్రప్రసాద్ తో చేసిన పెళ్లి పుస్తకం, ఎదిరింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం సినిమాలు మాత్రమే ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ఈమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.
ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీలోమహిళా నాయకురాలిగా ఆమె ఉంది.ఈ మధ్యకాలంలో క్రియాశీలకంగా కాస్తా యాక్టివ్ గానే ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత – ఏర్పాటు అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ టాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ ఉందని అన్నారు.
పరిశ్రమలోని పెద్దల పిల్లలు కూడా డ్రగ్స్ వాడతారని చెప్పారు.టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో గతంలో చేపట్టిన విచారణ ఎంత వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అవకాశాల కోసం దిగజారే జనాలు సినీ రంగంలో ఉన్నారని అన్నారు.రకుల్ ప్రీత్ సింగ్ కు అవకాశాలు ఇస్తున్నవారు ప్రణీతకి ఎందుకు ఇవ్వడం లేదని, ఆమెలో ఉన్నది ఏంటి, ఈమెలో లేనిది ఏంటి అని ప్రశ్నించారు.
సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ ఉందనే విషయం తెలిసిన ఎవరికీ సంబంధం లేనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు.సినీ రంగంలో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
తన కూతురు చదువుకుంటున్న హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారని అన్నారు.