అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.బ్రెజిల్ నుండి కోల్ కతా వచ్చిన స్మగ్లర్.
కోల్ కతా వచ్చేసరికి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటం అధికారులు గుర్తించారు.అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ తీయగా, అతని పొట్టలో డ్రగ్స్ ఉన్నట్లు తేలింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 44 డ్రగ్స్ క్యాప్సూల్స్ గుర్తించారు.ఒక్కో క్యాప్సూల్ 14 గ్రామల బరువు ఉంటుందని మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు తెలిపారు.
మొత్తం సుమారు అర కిలో కొకైన్ ను అతడు పొట్టలో బ్రెజిల్ నుండి కోల్ కతాకు తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు.
నిందితుడు బ్రెజిల్ కు చెందిన 31 ఏళ్ల పాల్ సీజర్ గా పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ అక్రమ సరఫరాపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.
నిందితుడే డ్రగ్స్ క్యాప్సూల్స్ మింగి బ్రెజిల్ నుండి భారత్ కు డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.నిందితుడికి అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడ దొరికాయన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత్ లో అతను ఎక్కడికి వెళ్తున్నాడు.ఎక్కడెక్కడ అతడిని లింకులు ఉన్నాయి.అతని కింద ఎవరు పని చేస్తున్నారు.మిగతా లింకులు ఎక్కడి వరకు ఉన్నాయన్న దానిపై మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు ఫోకస్ పెట్టారు.
కోల్ కతా ఎయిర్ పోర్టులో అతని కోసం ఎవరైనా వచ్చారా.క్యాబ్ లాంటివి బుక్ చేస్తే ఏ ప్రాంతానికి చేశాడన్న వివరాలు సేకరిస్తున్నారు.