ప్రకృతి మానవులకు ఎప్పుడు ఎదురు తిరుగుతుందో ఎవ్వరికి తెలియదు.ఎప్పుడు వర్షాలు పడతాయో.
ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో.ఎప్పుడు కరువు తాండవిస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేరు.
అలా ఎప్పుడు వాతావరణం మారుతుందో దానికి ప్రజలు ఎప్పుడు బలవుతారో అంచనా వేయలేము.ఇప్పుడు ఈ దేశం పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
అనుకోకుండా వచ్చిన వరదలకు ఆ దేశం అతలాకుతలం అవుతుంది.వరదలు ఒక్కసారిగా పోటెత్తడంతో ప్రజల పరిస్థితి అతలాకుతలం అవుతుంది.
ఇంతకీ ఆ దేశం ఏంటా అని అనుకుంటున్నారా.ఇరాక్.
ఈ దేశంలో వరదలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.మొన్నటి వరకు కరువుతో అల్లాడిన ఈ దేశం ఇప్పుడు వరదల ధాటికి విలవిల లాడుతుంది.
ఈ వరద దాటికి ఇప్పటికే 12 మంది ప్రజలు మరణించారని వందల మంది నిరాశ్రయులు అయ్యారని ఇరాక్ లోని స్థానిక మీడియా పలు కథనాలను విడుదల చేసింది.ఇక్కడ రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో ఒక్కసారిగా పలు నగరాల్లో వరదలు ముంచెత్తు తున్నాయి.దీంతో ముగ్గురు విదేశీయులతో సహా 12 మంది మరణించారని ఇరాక్ అధికారి తెలిపారు.
మరణించిన 12 మందిలో 10 నెలల పాప కూడా ఉంది అని తెలిపారు.వరద నీటిలో వారి వాహనం కొట్టుకు పోవడంతో నలుగురు అత్యవసర సేవల సిబ్బంది గాయ పడ్డారు.వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, కొన్ని కుటుంబాలు ఇళ్లను విడిచి రావాల్సి వచ్చిందని కరాచ్ చెప్పుకొచ్చారు.ఇరాక్ నగరంలో ఎంత దారుణంగా వరదలు ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చెబుతున్నాయి.
మరి ఈ వరదల నుండి ఈ దేశం ఎప్పుడు బయట పడుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.దీని గురించి తెలుసుకున్న వారంతా ఇదేం విచిత్రం అంటూ కామెంట్లు పెడుతున్నారు.