సాధారణంగా ఎక్కడైనా ఆకాశం నుంచి వర్షం పడుతుంది.అయితే ఆ దేశంలో మాత్రం గంజాయి ప్యాకెట్లు ఆకాశం నుంచి వర్షం రూపంలో కురుస్తున్నాయి.
వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన ఇజ్రాయిల్ దేశంలో చోటు చేసుకుంది.గంజాయి ప్యాకెట్లు ఆకాశం నుంచి పడటంతో అక్కడి స్థానికులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
రెండు రోజుల క్రితం ఇజ్రాయిల్ లోని టెల్ అవివ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆకాశం నుంచి కింద పడిన ప్యాకెట్లను సొంతం చేసుకోవడానికి కొంతమంది పోటీ పడ్డారు.
మరి కొంతమంది ఆ ప్యాకెట్లు ఎక్కడినుంచి కింద పడుతున్నాయో అర్థం కాక ప్యాకెట్లు కింద పడుతున్న ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
కొందరు కావాలనే డ్రోన్ల ద్వారా ఆకాశం నుంచి గంజాయి ప్యాకెట్లను కిందకు విసిరేశారని సమాచారం.
ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాలకే పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కావాలనే గంజాయి ప్యాకెట్లను వీళ్లు విసిరేశారని పోలీసుల విచారణలో తేలింది.
రాజకీయ ర్యాలీలు, నిరసనలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో గంజాయి పొట్లాలు కింద పడటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వాటిని తీసుకోవడానికి పోటీ పడ్డారు.ఇజ్రాయిల్ లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది.
వైరల్ అవుతున్న ఫోటోలను 71,000 మంది లైక్ చేయగా 5,900 మంది రీ ట్వీట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.