శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం సృష్టించింది.భావనపాడు సమీపంలో కొందరు మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.
పట్టుకున్న డ్రోన్ సుమారు 9 అడుగుల పొడవు కలిగి 111 కేజీల బరువున్నట్లు జాలర్లు గుర్తించారు.ఈ డ్రోన్ చిన్నపాటి విమానాన్ని పోలి ఉండటం విశేషం.
వెంటనే మత్స్యకారులు ఆ డ్రోన్ ను మెరైన్ పోలీసులకు అప్పగించారు.అయితే దాన్ని పరిశీలించిన పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు.