ఏటీఎం పేరు తలచుకుంటే చాలు నేరగాళ్లకు నోట్లో నీళ్ళూఊరుతాయ్.ఇక రక్షణ మాటెలా ఉన్నా చోరీలు ఉద్రుతంగానే సాగుతున్నాయి.
ఒక్కోసారి పోలీసు ఠాణా ఎదురుగా ఉన్న ఏటిఎం లను కొల్లగొట్టుకుపోతున్నసంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.ఈసారి ఏకంగా ఏటీఏంలో జమ చేయాల్సిన క్యాష్ ను వ్యాన్ తో పాటు మిస్ చేసి కొత్త రికార్డు సృష్టించారు సిబ్బంది .ముంబైలో శుక్రవారం చోరి వెలుగుచూసింది.లాగీ క్యాష్అనే సంస్థ సదరు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని ఏటీఎంలలో క్యాష్ ను జమ చేసే డీల్ లో ఉంది.
క్యాష్ ను ఒక వ్యాన్ లో ఏటీఎంలకు వెంటవెంటనే తరలించడమే ఆ సంస్థ ముఖ్యమైన పని.లాగీ క్యాష్ లో పనిచేసే అమర్ సింగ్ అనే డ్రైవర్ క్యాష్ కాస్తా చేజిక్కిన్చుకుంటే ఎలా ఉంటుంది అని పథకం వేసాడు .కోటి రూపాయలకు పైగా ఏటీఎంలలో జమచేయాల్సి ఉండగా ఆ క్రమంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు ఆవ్యాన్ చేరింది.అక్కడ రూ.16లక్షలు ఏటీఎంలో పెట్టడానికి సెక్యూరిటీ గార్డు ఏటీఎం మిషన్ ను డౌన్ చేశాడు.అప్పటికే బయట నిలుచుని ఉన్న ఆ డ్రైవర్ వాన్ తో సహా పరార్ అయ్యాడు.
వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు .దీనిపై పోలీసులు వెతుకులాట ముమ్మరం చేసారు ఆ వ్యాన్ తో డ్రైవర్ ఎత్తుకుపోయిన డబ్బు ఒక కోటి 28 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు .