మలయాళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తనదైన మార్క్తో తెరకెక్కించడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా పూర్తిగా సక్సెస్ అయ్యింది.
ఇక ఈ సినిమాను కథలో ఎలాంటి మార్పు లేకుండా ఇతర భాషల్లో రీమేక్ చేయగా, అన్ని చోట్లా ఇది సూపర్ సక్సెస్ అయ్యింది.
తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు.
అంతలా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడట.కాగా మోహన్ లాల్ 60వ పుట్టినరోజున ఈ సీక్వెల్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు ఈ డైరెక్టర్.
ఇక మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండే ఈ సీక్వెల్ కథ మొదలువుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు తెరకెక్కిస్తారు, తెలుగులో ఎవరు హీరోగా నటిస్తారు అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మరి దృశ్యం సాధించిన సక్సెస్ను ఈ సీక్వెల్ చిత్రం ఎలా కంటిన్యూ చేస్తుందో చూడాలి.ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాను శ్రీప్రియ డైరెక్ట్ చేయగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.