తెలుగు, మలయాళంలో తెరకెక్కిన దృశ్యం సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.
ఇందులో తెలుగులో లో హీరో విక్టరీ వెంకటేష్ నటించగా, మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు.ఇక ఇందులో మీనా రెండు భాషల్లో ఒకే పాత్రలో నటించింది.
ఇక తాజాగా మలయాళం లో విడుదల కాగా మీనా పై భారీ ట్రోల్స్ వస్తున్నాయి.
ఇటీవలే మలయాళంలో జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం ఓ టీ టీ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేశారు.ఏ సినిమా మంచి విజయాన్ని అందించగా తెలుగు దృశ్యం 2 కూడా రీమేక్ చేయనున్నారు.ఇక ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో మీనా లుక్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.
ఇందులో మీనా ఇద్దరు పిల్లల తల్లి గా నటించగా ఆమె కొన్ని సన్నివేశాలలో మేకప్ తో కనిపించింది.అంతేకాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా లిప్ స్టిక్ తో కనిపించగా నేటి జనుల నుండి కామెంట్లు ఎదురవుతున్నాయి.
తాజాగా దీని గురించి దర్శకుడు జీతు జోసెఫ్ స్పందించగా ఈ ట్రోల్స్ ను ఆయన అంగీకరిస్తాన్ననాడు.ఇదివరకే ఆయన ఈ పాత్రకు మేకప్ ఉండకూడదని మీనా ను అడుగగా డీ గ్లామర్ గా కనిపించేందుకు మీనా కు ఇష్టం లేదని చెప్పిందని ఆయన తెలిపారు.
దృశ్యం మొదటి భాగంలో కూడా మీనా పై ట్రోల్స్ రాగా అప్పుడు కూడా ప్రస్తావించినప్పటికీ ఒప్పుకోలేదని తెలిపాడు.లుక్ అంటే పర్ఫామెన్స్ కు ప్రాధాన్యత ఇచ్చే ఆయన చివరకు ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
మీనా తప్ప మిగిలిన నటులు మేకప్ లేకుండా నటించేందుకు ఓకే చెప్పారని తెలుపగా ఈ సినిమా పట్ల మంచి విజయం అందిందని సంతోషంగా ఉందని తెలిపాడు.