ఒక సినిమా సూపర్ హిట్గా నిలిచిందంటే, ప్రస్తుతం వాటికి సీక్వెల్స్ను తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు.ఇక ఇలాంటి సీక్వెల్ చిత్రాల్లో ఇటీవల రిలీజ్ అయిన మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు.ఇక దృశ్యం 2 చిత్రానికి లభించిన రెస్పాన్స్తో ప్రస్తుతం ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్.
అయితే మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను కూడా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమా తరువాత దృశ్యం 2కి మరొక సీక్వెల్ ఉండే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ అంటున్నారు.దృశ్యం 2 చిత్రాన్ని ముగించిన విధానంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కొనసాగింపు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు.
కాగా సీక్వెల్స్ను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారని ఆయన అంటున్నారు.సరైన పాయింట్ దొరికితేనే దృశ్యం-3 చిత్రాన్ని తెరకెక్కించే వీలుంటుందని ఆయన అంటున్నాడు.
ఏదో పేరుకు మాత్రమే సీక్వెల్ను తెరకెక్కిస్తే సరిపోదని ఆయన అంటున్నాడు.ఇక వెంకటేష్తో తెరకెక్కిస్తున్న తెలుగు దృశ్యం-2 చిత్రాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించి సినిమాను అంతే త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.
మరి దృశ్యం 2కి సీక్వెల్ చిత్రం ఎలాంటి కథతో వస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.