దృశ్యం. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆరేళ్ళ క్రితం మీనా తల్లి పాత్రలో, వెంకటేష్ తండ్రి పాత్రలో వచ్చి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో చెప్పాల్సిన పని లేదు.అలాంటి ఈ సూపర్ హిట్ సినిమాకు సిఖ్వల్ వస్తుందని గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి తెలుగు ఎలాంటి సీక్వెల్ రాలేదు.కానీ మలయాళంలో మాత్రం ఈ సినిమా సిఖ్వల్ వచ్చేసింది.
2013లో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా వచ్చి సూపర్ హిట్ కొట్టింది.కుటుంబం కోసం బాధ్యత గల తండ్రి ఎంత వరకైనా వెళ్తాడు అనేది ఈ సినిమా స్టోరీ.
జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ అన్ని భాషల్లో రీమేక్ చెయ్యగా.అన్ని ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టింది.ఈ సినిమా చైనీస్ భాషలోనూ రీమేక్ అయ్యింది.ఇక సినిమాకు సీక్వెల్గా దృశ్యం 2 అనే చిత్రాన్ని జీతూ జోసఫ్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను ఆంటోనీ పెరంబవూర్ నిర్మించగా.కరోనా వైరస్ నేపథ్యంలో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.ఈ టీజర్ కు నెట్టింట మంచి రెస్పాన్స్ వచ్చింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేరళలో ఇంతవరకు థియేటర్స్ తెరవకపోవడంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.త్వరలోనే ఓటిటి ప్లాట్ ఫార్మ్ అయినా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.
మరి దృశ్యం సినిమాలో పోలీస్ స్టేషన్ కింద దాచిన శవం ఈ దృశ్యం 2 లో బయటపడుతుందా? లేక అలాగే సీక్రెట్ గా ఉంటుందా అనేది ఈ సినిమాలో చూడాలి.