ఇటీవల కాలంలో సౌత్ కంటే బాలీవుడ్ పరిశ్రమ బాగా వెనుకబడి పోయింది.మన సౌత్ నుండి పాన్ ఇండియా సినిమాలతో వరుస రిలీజ్ లు అవ్వడమే కాకుండా ఆ సినిమాలు చాలా వరకు ఆకట్టు కోవడం భారీ కలెక్షన్స్ రాబట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
అయితే అదే సమయంలో బాలీవుడ్ కు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు.వచ్చిన ప్రతీ సినిమాను ప్లాప్ చేస్తున్నారు అక్కడి ప్రేక్షకులు.
అయితే ఇటీవలే బాలీవుడ్ లో రిలీజ్ అయినా బ్రహ్మాస్త్ర సినిమా హిట్ అవ్వక పోయిన భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఊపిరి పోసింది.ఎంత ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా కూడా నష్టాలు చూడక తప్పలేదు.
అయితే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ నుండి పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది.ఇది కూడా సౌత్ రీమేక్ సినిమా కావడం విశేషం.
బాలీవుడ్ ను గట్టెంకించే వారే లేరా అనుకుంటున్న సమయంలో అజయ్ దేవగన్ బాలీవుడ్ ను ఆదుకుంటున్నాడు.అజయ్ దేవగన్ శ్రీయ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా దృశ్యం 2.
ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త కళను తెచ్చింది.సౌత్ లో బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది.ఫస్ట్ డే నుండే ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు నచ్చడంతో మంచి కలెక్షన్స్ రాబడుతుంది.ఈ సినిమా ఫస్ట్ డే 15.38 కోట్ల వసూలు చేసి ఖాతా ఓపెన్ చేసింది.సౌత్ లో ఎలా హిట్ అయ్యిందో అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుంది.దృశ్యం2 ఏడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.ఇంకా అదే జోష్ తో రన్ అవుతుండడంతో ఈ సినిమా వసూళ్లు ఇప్పట్లో ఆగేలా లేవు.