భోజన సమయంలో నీరు త్రాగటం మంచిదేనా

సాధారణంగా మనం భోజనం చేసే సమయంలో ఒక గ్లాస్ మంచి నీళ్లను పెట్టుకుంటూ ఉంటాం.అలాగే హోటల్ కి వెళ్లి ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ముందుగా మంచినీళ్లను మన ముందు పెడతారు.

 Drinking Water At The Right Time-TeluguStop.com

అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఘన పదార్ధాలు తీసుకునేటప్పుడు మరియు ఘన పదార్ధాలు తిన్నా తర్వాత మంచి నీళ్లు త్రాగటం మంచిది కాదని అంటున్నారు.ఈ విధంగా నీటిని త్రాగటం వలన అది జీర్ణ వ్యవస్ధకు హాని కలిగించటమే కాకుండా జీర్ణ శక్తిని కోల్పోయేలా చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

మరి మంచి నీళ్లను ఎప్పుడు త్రాగాలి.భోజనం చేయటానికి అరగంట ముందు నీటిని త్రాగితే ఆ నీరు జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.భోజనం అయినా తర్వాత రెండు గంటలకు మంచి నీటిని త్రాగాలి.భోజనం తర్వాత త్రాగే నీరు పొట్టలో జీర్ణమైన ఆహారాన్ని, రసాలను తొలగించి శుభ్రం చేయటానికి సహాయాపడుతుంది.ఈ రకంగా తాగే నీరు జీర్ణ క్రియకు ఏ మాత్రం అడ్డంకి కాదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.

నీరు అవసరం లేనప్పుడు త్రాగితే అది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది.రోజు మొత్తం మీద ఎన్ని లీటర్ల నీటిని త్రాగాలో తెలుసుకుందాం.ఉదయం లేవగానే ఒక లీటర్ నీటిని త్రాగాలి.

మధ్యాహ్నం లంచ్ వరకు ఒక లీటర్ నీటిని త్రాగాలి.భోజనం చేసిన రెండు గంటల తర్వాత నుండి ఒక లీటర్ నీటిని త్రాగాలి.

రాత్రి డిన్నర్ లోపు మరో లీటర్ నీటిని త్రాగాలి.ఈ విధంగా ప్రతి రోజు శరీరానికి నాలుగు లీటర్ల నీటిని అందించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube