ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చెయ్యలేదంటూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.అయితే ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు చాలా తక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే.
దీనికి కారణం కేవలం తన అందచందాలతో గ్లామరస్ కు మాత్రమే ప్రధాన ఆయుధంగా చేసుకొని సినిమాలను తీయడంతో దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్త సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ.
ఇకపోతే తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
ఇక ఈ సినిమాలో ఆవిడ ఒక రైతుబిడ్డగా, గొర్రెల కాపరి గా నటించబోతుందని టాలీవుడ్ సమాచారం.
ఇందులో పూర్తిగా డి గ్లామర్ లుక్ లో కనబడుతోంది.ఇందుకు సంబంధించి షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉంది.
ఈ సినిమాకు సంబంధించి ఒక పాట చిత్రీకరణ తప్పించి మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని తెలుస్తోంది.ఇక ఈ విషయాన్ని తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులతో ఓ వీడియో షేర్ చేసి తెలిపింది.
‘డ్రీమ్ టీం తో.డ్రీమ్ రోల్.’ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆవిడ తెలిపింది.తనకు ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా తాజాగా ఆ షూటింగ్ సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది.రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న చెక్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే కమల్ హాసన్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2 సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఇవే కాకుండా బాలీవుడ్ లో కూడా మరో రెండు సినిమాలకు సైన్ చేసింది రకుల్.