ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 4, 5వ తారీఖులలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.ఫస్ట్ టైం రాష్ట్రపతి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు.
రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు.ఆదివారం విజయవాడలో ఉదయం 10:15 గంటలకు చేరుకొని.పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆతిథ్యంలో మధ్యాహ్న భోజనం స్వీకరించనున్నారు.
ఆ తర్వాత విశాఖపట్నం పర్యటనకు బయలుదేరనున్నారు.విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ లో జరిగే నేవి డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో సిఎం జగన్ కూడా పాల్గొనున్నారు.ఆ తర్వాత రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఇంకా పలు కార్యక్రమాలను కూడా ద్రౌపది ముర్ము ఈ పర్యటనలో ప్రారంభించనున్నారు.అనంతరం సోమవారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఉన్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.