ఈ సృష్టిలో డబ్బును మించింది మరేదీ లేదనే చెప్పాలి.డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారిపోతున్నారు.
డబ్బులు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదన్నట్టు మనుషుల పనులు ఉంటున్నాయి.ఇలా డబ్బు మాయలో పడి సంబంధాలు, మానవ విలువలను మర్చిపోతున్నారు.
కొన్ని సార్లు అయితే చంపడానికి కూడా వెనకాడట్లేదు.అయితే ఇప్పుడు కూడా ఓ వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతారు.
అతను డబ్బు కోసం ఇంతలా దిగజారిపోతాడా అని షాక్ అయిపోతాడు.
ఇంతకీ అతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ వ్యక్తి కుటంబం కోటి రూపాయల కోసం దారుణంగా వ్యవహరించింది.ఆ వ్యవహారం చివరకు వారిని కటకటాల్లోకి నెట్టేసింది.
మధ్యప్రదేశ్ కు చెందిన హనీఫ్(46) తమకు తెలిసిన సంస్థ నుంచి కోటి బీమా పాలసీ తీసుకున్నారు.ఇక ఎలాగైనా ఆ కోటి కొట్టేయడానికి ప్లాన్ వేశారు.
మాస్టర్ స్కెచ్ వేశారు.ఇందుకు ఓ వృద్ధ డాక్టర్ సాయంతో చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారు.
హనీఫ్ భార్య రెహానా ఇక్బాల్ ఇందులో కీలకంగా వ్యవహరించారు.తన భర్త చనిపోయాడని బీమా కోసం వెళ్లారు.
అయితే అనుమానంతో ఆ కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక వారు రంగంలోకి దిగిపోయాక హనీఫ్ బతికే ఉన్నట్లు తేలడంతో అంతా షాక్ అయిపోయారు.హనీఫ్ కావాలని డబ్బుల కోసం ఇలా చనిపోయినట్టు డ్రామా ఆడినట్టు తేలింది.
ఇక వైద్యుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇందులో డాక్టర్ కు కూడా కొంత మొత్తం ఇస్తామని చెప్పడంతో ఆయన ఇలా వారికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.దీన్ని తెలుసుకున్న వారంతా రకరకాల కామెంట్లు పెట్టేస్తున్నారు.
.