భారత్, చైనా సైనికుల మధ్య జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ సరిహద్దుల్లో ఘర్షణ చోటు చేసుకుందన్న విషయం తెలిసిందే.అయితే ఈ ఘర్షణలో 20 మంది వరకు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని మన ప్రభుత్వం ప్రకటించింది.
అయితే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు కూడా మరణించారని, కానీ ఎంత మంది మరణించారు అన్న విషయంలో ఇప్పటి వరకు ఒక సృష్టత లేదు.ఎందుకంటే ఈ విషయాన్ని చైనా మాత్రం ప్రకటించలేదు.
కాగా చైనా సైనికులు ఒక 35 మంది వరకు మరణించి ఉంటారని అప్పట్లో భారత్ ప్రకటించింది.
రష్యా మీడియా కూడా ఈ ఘర్షణలో 45 మంది వరకు చైనా సైనికులు మృతి చెందారని ఇటీవల కూడా ప్రకటించింది.ఈ క్రమంలో తమ సైనికులు చనిపోలేదని అబద్దాలు ఆడుతున్న చైనా చివరకు చేసేది ఏమీ లేక తమ సైనికులు ఐదుగురు మాత్రమే చనిపోయారని ప్రకటించింది.ఇక వారి పేర్లను వెల్లడించి, మరణించిన వారికి అవార్డులను కూడా ప్రకటించింది.